'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-42’
'హోకె మజ్బూర్ హమే ఉస్ నే భులాయాహోగా '
(ఏమీచేయలేనిస్థితిలో ఆమె నన్ను మరచిపోయి ఉంటుంది).'హకీకత్ ' సినిమాలో పాట.
యుద్ధం తాతయ్య గారని ఒకాయన మా చిన్నతనంలో వుండేవాడు.మిలటరీ లో పనిచేసి రావటంవల్ల ఆయనకాపేరు. భజన కార్యక్రమాల్లో హార్మొనీ వాయించేవారు.చనిపోయేదాకా తాడిచెట్టులా ఏ మాత్రం వంగకుండా వున్నాడు. మామ వరసయ్యే మరొకాయన మిలటరీ లో పనిచేసి మా వూహ తెలిసేసరికి ఆర్ టి సి లో డ్రైవరు గా కుదురుకున్నాడు.మావూర్లోనే పనిచేసే ఫారెస్ట్ ఉద్యోగికొడుకొకాయన అప్పటికి మిలటరీలో పనిచేస్తూ సెలవలకు మా వూరొచ్చేవాడు.ఆయన సాహసాలు వినటానికి,అతనుతెచ్చే మిలటరి నేపధ్యపు తెలుగు మాగజైనుకోసం అతని చుట్టూ మూగేవాళ్ళం.
ఇంట్లోంచి పారిపోయి గుంటూరెళ్ళి యుద్ధంలో చేరిపోవటం గురించి పెద్దాళ్ళు అనుకునేవారు.సైన్యానికి సంబంధించి నా జ్ఞాపకాలు ఇవి.
వివిధభారతిలో సాయంత్రం 7.05నిముషాలకు 'జయ్ మాల 'పేరుతో సైనికులకోసం ప్రత్యేకంగా పాటల ప్రోగ్రాం వస్తుండేది. కాలేజి రోజుల్లో మెస్ కు వెళ్ళేప్పుడో ,వచ్చేప్పుడో దారిలో ఇళ్ళనుండి ‘జయ్ మాల’ ప్రోగ్రామ్ ట్యూన్ వినవచ్చేది. డ్రమ్ముల శబ్దం,మార్చింగు తరహా సంగీతంతో ఆకర్షించేది.
ఆ కార్యక్రమం లో సైనిక నేపధ్యపు పాటలు వచ్చేవి.చాలా పాటలు రిపీట్ ఔతుంటాయి. అలా విన్న పాటల్లో మెల్ల మెల్లగా మనసుకు దగ్గరైన ఒక పాట..."హోకె మజ్ బూర్ ఉస్ నే భులాయా హోగా".ఇది 'హకీకత్ ' సినిమాలోనిది.
ఈ సినిమా శ్రీనివాస టాకీస్(ఏలూరు ) లో 83లోమార్నింగు షో గా వచ్చింది. పాట కోసం సినిమా చూశాను.నలుపు తెలుపు సినిమా. అప్పుడు నన్ను గొప్పగా ఆకర్షించ లేదు.
క్రమంగా అవగతమైన విషయం ..’హకీకత్’ సినిమా 'మదర్ ఆఫ్ ఇండియన్ వార్ మూవీస్ ' గా పేరుపొంది అనేక సినిమాలకు ఆధారమయ్యింది.
చేతన్ ఆనంద్ దర్శకత్వం ,బలరాజ్ సహ్ని,ధర్మేంద్ర,విజయానంద్,సంజయ్ ఖన్ వంటి పెద్దనటులు, అప్పుడే జరిగిన ఇండో చైనా వార్ నేపధ్యం, దేశం కోసం రక్త తర్పణ చేయమంటూ రోమాంచితంచేసే కర్ చలే హం ఫిదా జాన్ ఓ తన్ సాథియో వంటి పాటలు .. చిత్రాన్ని యుద్ధ సినిమాలకు ఒక కొలమానం గా మార్చాయి.
ఐతే 'హోకె మజ్బూర్ హమే ఉస్ నే భులాయాహోగా ' పాట మాత్రం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ పాట ఒక్క సైనికులకనే కాదు, ఇష్టమైన తనవారి ఎడబాటు అనుభవిస్తూ,దానికి తోడు కష్టాలు అనుభవిసూ,రేపటి పట్ల భరోసా లేకుండా, అసహాయులైన తనవారికోసం తల్లడిల్లే అనేకమందిని గుర్తుతెస్తుంది.
సినిమానే కాదూ, నాకు సంబంధించి ఈ పాట కూడా మల్టి స్టారరే.. పాత తరం గాయకుడు 'తలత్ మొహమూద్ ',శాస్థ్రీయ గానంలో ఉద్దండుడు 'మన్నాడే ', విశేషణాలు అవసరం లేని మహమ్మద్ రఫీ, తలత్ మొహమూద్ నుండి బాటన్ అందుకుంటున్నట్టు 'భూపేందర్ '(అతనికిది తొలిపాట?) ..వీరందరి గాన వాహిని ఈ పాట.ఈ పాట రచన దిగ్దంతుడు 'కైఫీ ఆజ్మీ ' సంగీతం 'మదన్ మోహన్ '.
“ఏమీచేయలేనిస్థితిలో ఆమె నన్ను మరచిపోయి ఉంటుంది
మౌనంగా బాధను విషంలాంటి మందులా మింగి ఉంటుంది
పాత కథలు ను ఆమె మనసు వినిపించి ఉండి ఉంటుంది
కన్నీటిని కళ్ళతో తాగేసి పొర్లనీకుండా చేసుంటుంది
తలుపులు మూసిన గదిలో నా ఉత్తరాన్ని కాల్చేసి ఉంటుంది.
అందులోని ప్రతీ అక్షరం తన నుదిటిపైకి ఉబికి వస్తుండి వుంటుంది.
చూపుల్లోని భయన్ని బయటకు తెలియనీకుండా ఉంచుంటుంది
ముక్కలైన హృదయం?????
మేజా బల్ల మీది నా ఫొటో తిసినపుడు నేను పడే బాధ ఆమెకు అర్ధమౌతూ ఉంటుంది.
ఆమె కోరికలన్నీ ఆవిరౌతూ ఉండిఉండాలి
బాధను స్పురింపజేసేలా నవ్వుతూఉండి ఉండాలి
నాపేరు విన్నంతనే అశృవులు రాలుతూ ఉండిఉండాలి
జతరాలి భుజంపై తలవాల్చుకుని ఉంటుంది
తలను అయిష్టంగా దువ్వించుకుంటూ ఉండి ఉంటుంది
బాధామేఘాలు ముఖంపై కమ్ముకుని ఉండి ఉంటాయి.
కళ్ళలో కాంతి చానాళ్ళుగా ఉండి ఉండదు.
ముఖం చానాళ్ళగా కళ తప్పే ఉండిఉంటుంది.”
-ముళ్ళపూడి సుబ్బారావు
'హోకె మజ్బూర్ హమే ఉస్ నే భులాయాహోగా '
(ఏమీచేయలేనిస్థితిలో ఆమె నన్ను మరచిపోయి ఉంటుంది).'హకీకత్ ' సినిమాలో పాట.
యుద్ధం తాతయ్య గారని ఒకాయన మా చిన్నతనంలో వుండేవాడు.మిలటరీ లో పనిచేసి రావటంవల్ల ఆయనకాపేరు. భజన కార్యక్రమాల్లో హార్మొనీ వాయించేవారు.చనిపోయేదాకా తాడిచెట్టులా ఏ మాత్రం వంగకుండా వున్నాడు. మామ వరసయ్యే మరొకాయన మిలటరీ లో పనిచేసి మా వూహ తెలిసేసరికి ఆర్ టి సి లో డ్రైవరు గా కుదురుకున్నాడు.మావూర్లోనే పనిచేసే ఫారెస్ట్ ఉద్యోగికొడుకొకాయన అప్పటికి మిలటరీలో పనిచేస్తూ సెలవలకు మా వూరొచ్చేవాడు.ఆయన సాహసాలు వినటానికి,అతనుతెచ్చే మిలటరి నేపధ్యపు తెలుగు మాగజైనుకోసం అతని చుట్టూ మూగేవాళ్ళం.
ఇంట్లోంచి పారిపోయి గుంటూరెళ్ళి యుద్ధంలో చేరిపోవటం గురించి పెద్దాళ్ళు అనుకునేవారు.సైన్యానికి సంబంధించి నా జ్ఞాపకాలు ఇవి.
వివిధభారతిలో సాయంత్రం 7.05నిముషాలకు 'జయ్ మాల 'పేరుతో సైనికులకోసం ప్రత్యేకంగా పాటల ప్రోగ్రాం వస్తుండేది. కాలేజి రోజుల్లో మెస్ కు వెళ్ళేప్పుడో ,వచ్చేప్పుడో దారిలో ఇళ్ళనుండి ‘జయ్ మాల’ ప్రోగ్రామ్ ట్యూన్ వినవచ్చేది. డ్రమ్ముల శబ్దం,మార్చింగు తరహా సంగీతంతో ఆకర్షించేది.
ఆ కార్యక్రమం లో సైనిక నేపధ్యపు పాటలు వచ్చేవి.చాలా పాటలు రిపీట్ ఔతుంటాయి. అలా విన్న పాటల్లో మెల్ల మెల్లగా మనసుకు దగ్గరైన ఒక పాట..."హోకె మజ్ బూర్ ఉస్ నే భులాయా హోగా".ఇది 'హకీకత్ ' సినిమాలోనిది.
ఈ సినిమా శ్రీనివాస టాకీస్(ఏలూరు ) లో 83లోమార్నింగు షో గా వచ్చింది. పాట కోసం సినిమా చూశాను.నలుపు తెలుపు సినిమా. అప్పుడు నన్ను గొప్పగా ఆకర్షించ లేదు.
క్రమంగా అవగతమైన విషయం ..’హకీకత్’ సినిమా 'మదర్ ఆఫ్ ఇండియన్ వార్ మూవీస్ ' గా పేరుపొంది అనేక సినిమాలకు ఆధారమయ్యింది.
చేతన్ ఆనంద్ దర్శకత్వం ,బలరాజ్ సహ్ని,ధర్మేంద్ర,విజయానంద్,సంజయ్ ఖన్ వంటి పెద్దనటులు, అప్పుడే జరిగిన ఇండో చైనా వార్ నేపధ్యం, దేశం కోసం రక్త తర్పణ చేయమంటూ రోమాంచితంచేసే కర్ చలే హం ఫిదా జాన్ ఓ తన్ సాథియో వంటి పాటలు .. చిత్రాన్ని యుద్ధ సినిమాలకు ఒక కొలమానం గా మార్చాయి.
ఐతే 'హోకె మజ్బూర్ హమే ఉస్ నే భులాయాహోగా ' పాట మాత్రం నాకు ఆల్ టైమ్ ఫేవరెట్. ఆ పాట ఒక్క సైనికులకనే కాదు, ఇష్టమైన తనవారి ఎడబాటు అనుభవిస్తూ,దానికి తోడు కష్టాలు అనుభవిసూ,రేపటి పట్ల భరోసా లేకుండా, అసహాయులైన తనవారికోసం తల్లడిల్లే అనేకమందిని గుర్తుతెస్తుంది.
సినిమానే కాదూ, నాకు సంబంధించి ఈ పాట కూడా మల్టి స్టారరే.. పాత తరం గాయకుడు 'తలత్ మొహమూద్ ',శాస్థ్రీయ గానంలో ఉద్దండుడు 'మన్నాడే ', విశేషణాలు అవసరం లేని మహమ్మద్ రఫీ, తలత్ మొహమూద్ నుండి బాటన్ అందుకుంటున్నట్టు 'భూపేందర్ '(అతనికిది తొలిపాట?) ..వీరందరి గాన వాహిని ఈ పాట.ఈ పాట రచన దిగ్దంతుడు 'కైఫీ ఆజ్మీ ' సంగీతం 'మదన్ మోహన్ '.
“ఏమీచేయలేనిస్థితిలో ఆమె నన్ను మరచిపోయి ఉంటుంది
మౌనంగా బాధను విషంలాంటి మందులా మింగి ఉంటుంది
పాత కథలు ను ఆమె మనసు వినిపించి ఉండి ఉంటుంది
కన్నీటిని కళ్ళతో తాగేసి పొర్లనీకుండా చేసుంటుంది
తలుపులు మూసిన గదిలో నా ఉత్తరాన్ని కాల్చేసి ఉంటుంది.
అందులోని ప్రతీ అక్షరం తన నుదిటిపైకి ఉబికి వస్తుండి వుంటుంది.
చూపుల్లోని భయన్ని బయటకు తెలియనీకుండా ఉంచుంటుంది
ముక్కలైన హృదయం?????
మేజా బల్ల మీది నా ఫొటో తిసినపుడు నేను పడే బాధ ఆమెకు అర్ధమౌతూ ఉంటుంది.
ఆమె కోరికలన్నీ ఆవిరౌతూ ఉండిఉండాలి
బాధను స్పురింపజేసేలా నవ్వుతూఉండి ఉండాలి
నాపేరు విన్నంతనే అశృవులు రాలుతూ ఉండిఉండాలి
జతరాలి భుజంపై తలవాల్చుకుని ఉంటుంది
తలను అయిష్టంగా దువ్వించుకుంటూ ఉండి ఉంటుంది
బాధామేఘాలు ముఖంపై కమ్ముకుని ఉండి ఉంటాయి.
కళ్ళలో కాంతి చానాళ్ళుగా ఉండి ఉండదు.
ముఖం చానాళ్ళగా కళ తప్పే ఉండిఉంటుంది.”
-ముళ్ళపూడి సుబ్బారావు