Showing posts with label jaspal singh. Show all posts
Showing posts with label jaspal singh. Show all posts

Saturday, October 21, 2017

గగన్ యె సంఝా చాంద్ సుఖీ హై

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-114
“గగన్ యె సంఝా చాంద్ సుఖీ హై ,చాంద్ కహే సితారే”
(గగనం అనుకుంటుంది చంద్రుడు సుఖంగా ఉన్నాడని,చంద్రుడనుకుంటాడు తారలు సుఖంగాఉన్నవని)
సావన్ కో ఆనే దో (1979) సినిమాలో పాట. మదన్ భారతి రచన ,రాజ్ కమల్ సంగీతం, జస్పాల్ సింగ్ గానం.
“నీ ఆనందం ముసుగుతొలగిన నీ దుఃఖమే .
పొంగిపొర్లే ఇప్పటి ఆనందపు బావులు ,ఇంతకుమునుపు నీ కన్నీళ్ళతో నిండినవే…...
కొందరంటారు సంతోషం దుఃఖానికన్నా గొప్పదని.ఇంకొందరంటారు దుఃఖమే గొప్పదని.
నేనంటాను అవి అవిభాజ్యాలుఅని. అవి కలిసే వస్తాయి.ఒకటి నీతో కలిసి భోజనం చేస్తుంటే మరొకటి నీ పడక మీద నిద్రిస్తూఉంటుంది.”
ఇవి ఖలీల్ జిబ్రాన్ (ప్రాఫెట్ పుస్తకంలో )సంతోషం ,దుఃఖం గురించి చెప్పిన దానిలో కొన్ని వాక్యాలు.
ఈ సినిమా పాట పల్లవి లో ‘దుఃఖ్ మే హి సుఖ్ హై చిపారే’ పాదం వింటుంటే ఖలీల్ జిబ్రాన్ చెప్పింది మనసులో మెదులుతుంది.
అలాగే చివరి పదాలలో ‘ధన్ వాన్, నిర్ధన్, జగ్ కి మాయా’ విన్నపుడు
“మాయంటావా? అంతా మిధ్యంటావా?నా ముద్దుల వేదాంతీ” అన్న శ్రీ శ్రీ మాటలు గుర్తొస్తాయి.
సావన్ కో ఆనేదో సినిమాలో అన్ని పాటలూ ప్రజలకు చేరువైనవే. మిగతావాటితో పోల్చినపుడు ఈ పాటే తక్కువ వినపడేది. ఐతేనేం? గుర్తుండిపోయే పాటే!
“ గగనం అనుకుంటుంది చంద్రుడు సుఖంగా ఉన్నాడని,చంద్రుడనుకుంటాడు తారలు సుఖంగాఉన్నవని
సాగరలహరులనుకుంటాయి తమకన్నా తీరం సుఖంగాఉందని
ఓ మిత్రుడా! దుఃఖం లోనే సుఖం దాగిఉంది
దూరపుకొండ దూరంగా ఉన్నపుడు ప్రశాంతంగా కనపడుతుందందరికీ
దగ్గరకు పోయి చూస్తే రాళ్ళగుట్టలమయం
మొగ్గలనుకుంటాయి తోటసుఖంగా ఉందని ,తోట అంటుంది వసంతం సుఖం గా ఉందని
మిత్రుడా! దుఃఖం లోనే సుఖం దాగిఉంది
ఓ అన్నా! ఓ మిత్రుడా! ఓ రామా
చీకటి రాత్రి మనసులో అనుకుంటుంది పగటివేళ వెలుతురుంటుందని
వేడి పగలు అనుకుంటుంది చీకటి చల్లనైనదని
శిశిరమనుకుంటుంది వర్షాకాలం సుఖంగా ఉందని ,, వర్షాకాలం వేసవి సుఖంగా ఉందనుకుంటుంది.
ఓ మిత్రుడా! దుఃఖం లోనే సుఖం దాగిఉంది
బంధువా! మిత్రుడా! బంధువా!
నిర్ధనుడు ధనేచ్చ ను తోడ్కొని ఎక్కడెక్కడో తిరుగుతాడు
ధనవంతుడికి శాంతి ఉండదు . ఇది ఎలాంటి జగన్మాయ
ఒకరినొకరు సుఖి అనుకుంటూ అందరూ సుఖాన్ని పిలుస్తారు
ఓ మిత్రుడా! దుఃఖం లోనే సుఖం దాగిఉంది”