నచ్చిన’ పాటలు-’లోపలి’ మాటలు-89
“కహా తక్ యే మన్ కో అంధేరే ఛలేంగే”
(ఈ మనసులో చీకటి ఎప్పటివరకు)
బాతో బాతో మే సినిమాలో కిశోర్ కుమార్ ఆలపించిన పాట.సంగీతం రాజేశ్ రోషన్, రచన యోగేశ్.
తెలుగు సినిమా అప్పటికి (80ల నాటికి) అర్బనైజ్ (నగరీకరణ) కాలేదు. చాలా సినిమాల మూలాలు పల్లేలోనే ఉండేవి. నగరవాసులు అప్పటికి విలన్లే. ఐతే హిందీ సినిమాలు చాలారోజులకుముందే సిటీకి వచ్చేసాయి. నగరజీవిత నేపధ్యంలో సినిమాలు చాలానే ఉన్నాయి. 79లో వచ్చిన ‘బాతో బాతోమే’ అలాంటి ఒక నగర సినిమా.
అమితాబ్ ఒక రకమైన సినిమాల్లో సూపర్ స్టార్ ఐతే ,కథానాయకుడు అమోల్ పాలేకర్ మరో తరహా సినిమాల్లో సూపర్ స్టార్. అప్పుడు మధ్యతరగతి,ఉద్యోగాల్లో ఉన్న నగర యువతకు అతనో మోడల్.
బొంభాయిలో ఉద్యోగస్తుల జీవితం, ఆలోచనలు,కలలు వీటిని రియలిస్టిక్ అనిపించేలా తీసిన సినిమా ఇది. రైలులో ఉద్యోగానికి పోయిరావటం ,అందులో పరిచయాలు, ప్రేమలు, అర్ధాలు, అపార్ధాలు, పెద్దమనిషి మధ్యవర్తిత్వం వీటితో కథ సాగుతుంది. కథానాయిక తల్లి ఆశలవల్ల ప్రేమికులమధ్య దూరం పెరిగింది. ఆ దూరం కథానాయకుని బాధించింది. ఆ సందర్భంలో వెచ్చే పాట.
“ఈ మనసులో చీకటి ఎప్పటివరకు
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
కొద్దిసేపు సుఖం, కొద్దిసేపు దుఃఖం ,ఇదే జీవితం
ఈ శిశిర ఋతువు ఒకటి రెండు ఘడియలపాటే
కొత్త పుష్పాలు దారిలో తిరిగి వికసిస్తాయి
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
ప్రచండ వేగంతో వీస్తుంది గాలి
నా మనసులో నువ్వు నమ్మకాన్ని నిలిపావు
ప్రయాణంలో విడిపోయిన నిన్ను తిరిగి కలుస్తాను.
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?
ఎవరేమి చెప్పినా నిజమిదే
ప్రేమకెరటాలు ఎక్కడ మొదలైనా
వాటికి ఏదో ఒకరోజు ఒడ్డు దొరుకుతుంది
బాధించే ఈ రోజులు ఎప్పుడు ముగుస్తాయి?”