Showing posts with label hawavo pe likh doo. Show all posts
Showing posts with label hawavo pe likh doo. Show all posts

Thursday, February 8, 2018

హవావోం పె లిఖ్ దూ.. హవావోం కె నామ్

‘నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-136
`హవావోం పె లిఖ్ దూ.. హవావోం కె నామ్`
(గాలుల పేరుమీద ...గాలుల పై వ్రాస్తాను)
దో దూని చార్ -1968 (రెండు రెళ్ళు నాలుగు) సినిమా లో కిశోర్ కుమార్ పాడిన పాట. గీత రచన గుల్జార్. స్వర రచన హేమంత్ కుమార్.
పురవాయీ /పురవయ్యా( తూరుపు గాలి) పదం హిందీ సినీ సాహిత్యంలో బాగా వినిపిస్తుంది. ...
తూరుపుగాలి ఒక దశలోహిందీపాటల్లో కూడా బాగా తోలింది. పంకజ్ మలిక్,ఎస్ డి బర్మన్, సలీల్ చౌధురి,హేమంత్ కుమార్ వంటి సంగీతదర్శకులు వంగ ప్రాంతపు సంగీతాన్ని, రవీంద్ర సంగీతాన్నిహిందీ పాటలద్వారా దేశం మొత్తానికి పంచి ఇచ్చారు. ప్రత్యేకంగా అరవైలవరకూ బెంగాలీ ముద్ర వారిపాటల్లో కనిపిస్తుంది.
ఆ కాలంలో వచ్చిన పాట ఇది.ప్రకృతిని వర్ణించేది. కిశోర్ కుమార్ తనకోసం తానే పాడుకున్నాడు. పంచె కట్టు, బెంగాలీ లాల్చీ తో అచ్చమైన బెంగాలీ బాబులా కనిపిస్తాడు. పాటలో కనిపించే బాలనటి తర్వాత హీరోయిన్ గా ఎదిగిన నీతూసింగ్. ‘దో దూనీ చార్ ‘ (2010)పేరుతోనే వచ్చిన సినిమాలో గృహిణి గా నటించింది .
ఈ ‘కిశోర’ ’హేమంత’ సమీరం వింటున్నపుడు అది శరీరాన్ని తాకుతున్నట్టే కాదు మనసునూ స్పృశిస్తున్నట్టనిపిస్తుంది. 

“గాలుల పేరుమీద గాలుల పై వ్రాస్తాను
ఈ అపరిచిత పరదేశి ప్రణామం.

ఓ పక్షీ ! నీ ఈ రాగయుక్తమైన ఈ ప్రణామం
ఎవరిపేరుమీద ఎవరికోసమో చెప్పు

తరుశాఖలపై వెలుగుకిరణం వచ్చి
చేయి సాచినపుడు
చీకటి నెమ్మదిగా కిందికి దిగి
నవ్వుతూ చెప్పింది
ఇక్కడ ఉదయ సాయంత్రాలు ఆటలాడుతూఉంటాయని

ఆకతాయి నీరు తన దారిన ప్రవహించటం మరచి
అద్దంలా మారి పూలపైకి ప్రతిఫలిస్తుంది
ఈ అమాయకపు పసి ముఖాలను.”