'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-29’
'మొహబ్బత్ క్యా చీజ్ హంకో బతావ్ ‘
(ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.)
...
(ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.)
...
ఆకర్షణల విషయంలో మనసును నియంత్రించటంలో విఫలమైతే అది నశింపుకు దారితీస్తుందంటారు(ఆది శంకరాచార్య వివేకచూడామణిలో).అందుకు ఉదహరణగా,లేడి(సంగీతం వింటూ), ఏనుగు(ఆడఏనుగు స్పర్శకు లోబడి), శలభం (అగ్నితో),చేప(ఎర తో),భ్రమరా లను (సుగంధంతో) అంతమౌతాయంటారు.
కమలంలో మకరందానికో,సుగంధానికో మైమరచి సూర్యాస్తమయమయ్యేంతవరకూ కమలంలోనే ఉండిపోతుంది భ్రమరం. సూర్యాస్తమయంతో కమలపురేకులు ముడుచుకుపోతాయి. భ్రమరం కమలంలో బందీయై నశించిపోతుంది.
శలభం అగ్నిశిఖతో ఆకర్షింపబడి అందులోనే కాలిపోతుంది.(ఉర్దూ సాహిత్యంలో,హింది సినిమా పాటల్లోనూ షమ్మా ,పర్వానా పదాలు విరివిగా వాడబడతాయి."ఇస్ షమ్మ్-ఎ-ఫరోజా కే పర్వానె హజారో హై","జల్నే మె క్యా మజా హై పర్వానే జానతే హై")
ప్రేమంటే ఏమిటో అనేకమంది చెప్పిఉన్నారు.చెబుతూనే ఉంటారు. చాలమంది దృష్టిలోఇప్పటికీ అది’ బ్రహ్మపదార్ధమే’. అదేమిటో తెలుసుకోవాలనీ అభిలాష ఉంటూనేవుంటుంది.అది ఎలాఉంటుంది,ఎపుడుమొదలయ్యింది,దాని లక్షణాలు..ఇవన్నీ అంతుచిక్కనివే.
'ప్రేమ్రోగ్' సినిమాను రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.అందులో ఒకపాట 'మొహబ్బత్ క్యా చీజ్ హంకో బతావ్ ". ప్రేమగురించి ఒక పెద్ద ఇంటి అమ్మాయి అమాయకంగా ప్రశ్నిస్తుంది. ఆ కుటుంబనీడన ఎదిగి ఆమెను ఇష్టపడుతున్న వ్యక్తి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.సమాధానమూ ప్రశ్నగానే మిగులుతుంది.
ఈ పాట కోసం రచయిత పైనచెప్పిన రెంటిని (భ్రమరం,దీపపు పురుగు) ఉపయోగిస్తాడు.
“పగలు ఎందుకు వస్తుంది? రాత్రి ఎందుకు ఔతుంది?
వేదన ఎక్కడపుడుతుంది? కళ్ళు ఎందుకు రోదిస్తాయి?
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.
దీనిని ఎవరు మొదలుపెట్టారో నాకు వినిపించు.
సాయంత్రం వరకూ ఒక భ్రమరం పూవు లోపల చరిస్తూ ఉంది.
రాత్రయ్యేసరికి కమలపు రేకుల్లో బందీ అయ్యింది
ఉదయం ఖైదు నుండి విడుదల య్యాక ..ఏమయ్యిందని నేనడిగాను
అది ఏమీ మాట్లాడదు...తనలోకంలో తను ఈ పదాలు పాడుకుంటుంది
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.
ఈ శరీరం ఎందుకు జ్వలిస్తుంది?ఈ శ్వాస వెచ్చగా ఎందుకువుంది?
ఇది ఎలాంటి అగ్ని? ఈ దీపం ఎందుకు మలిగిపోతుంది?
దీపం వెలుగంగానే శలభం వచ్చింది
అగ్ని ఒడిలో తనకి తాను దూకింది.
నేను మరో శలభాన్ని అడిగాను..అగ్నిలో ఉన్నదేమిటని
అది ఏమీ మాట్లాడదు...తనలోకంలో తను ఈ పదాలు పాడుకుంటుంది
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.
నిషా ఎలా ఉంటుంది? అడుగులుతడబడతాయెందుకు?
కంటికి ఏమీ ఎందుకు కానరాదు? ఈ ఆనందం ఎలాకలుగుతుంది?
ఒకరోజు మధుశాల వైపు చూడవెళ్ళాను
మైకపు కౌగిలిలోఉన్న ఒక తాగుబోతు అటు వెళుతున్నాడు
నేనతన్ని అడిగాను ..ఎందుకు జీవితమంతా తాగుతూనే ఉన్నావని.
అతను ఏమీ మాట్లాడడు...తనలోకంలో తను ఈ పదాలు పాడుకుంటు న్నాడు
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.”
ఏవైతే నాశన హేతువలని చెప్పారో అవే ప్రేమానుభూతికి కారణాలౌతున్నయని కవి అంటున్నాడు.
(గీత రచయిత సంతోష్ ఆనంద్, సంగీతకారులు లక్షికాంత్ ప్యారేలాల్, గానం సురేష్ వాడ్కర్,లతా)
-ముళ్ళపూడి సుబ్బారావు
కమలంలో మకరందానికో,సుగంధానికో మైమరచి సూర్యాస్తమయమయ్యేంతవరకూ కమలంలోనే ఉండిపోతుంది భ్రమరం. సూర్యాస్తమయంతో కమలపురేకులు ముడుచుకుపోతాయి. భ్రమరం కమలంలో బందీయై నశించిపోతుంది.
శలభం అగ్నిశిఖతో ఆకర్షింపబడి అందులోనే కాలిపోతుంది.(ఉర్దూ సాహిత్యంలో,హింది సినిమా పాటల్లోనూ షమ్మా ,పర్వానా పదాలు విరివిగా వాడబడతాయి."ఇస్ షమ్మ్-ఎ-ఫరోజా కే పర్వానె హజారో హై","జల్నే మె క్యా మజా హై పర్వానే జానతే హై")
ప్రేమంటే ఏమిటో అనేకమంది చెప్పిఉన్నారు.చెబుతూనే ఉంటారు. చాలమంది దృష్టిలోఇప్పటికీ అది’ బ్రహ్మపదార్ధమే’. అదేమిటో తెలుసుకోవాలనీ అభిలాష ఉంటూనేవుంటుంది.అది ఎలాఉంటుంది,ఎపుడుమొదలయ్యింది,దాని లక్షణాలు..ఇవన్నీ అంతుచిక్కనివే.
'ప్రేమ్రోగ్' సినిమాను రాజ్ కపూర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.అందులో ఒకపాట 'మొహబ్బత్ క్యా చీజ్ హంకో బతావ్ ". ప్రేమగురించి ఒక పెద్ద ఇంటి అమ్మాయి అమాయకంగా ప్రశ్నిస్తుంది. ఆ కుటుంబనీడన ఎదిగి ఆమెను ఇష్టపడుతున్న వ్యక్తి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.సమాధానమూ ప్రశ్నగానే మిగులుతుంది.
ఈ పాట కోసం రచయిత పైనచెప్పిన రెంటిని (భ్రమరం,దీపపు పురుగు) ఉపయోగిస్తాడు.
“పగలు ఎందుకు వస్తుంది? రాత్రి ఎందుకు ఔతుంది?
వేదన ఎక్కడపుడుతుంది? కళ్ళు ఎందుకు రోదిస్తాయి?
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.
దీనిని ఎవరు మొదలుపెట్టారో నాకు వినిపించు.
సాయంత్రం వరకూ ఒక భ్రమరం పూవు లోపల చరిస్తూ ఉంది.
రాత్రయ్యేసరికి కమలపు రేకుల్లో బందీ అయ్యింది
ఉదయం ఖైదు నుండి విడుదల య్యాక ..ఏమయ్యిందని నేనడిగాను
అది ఏమీ మాట్లాడదు...తనలోకంలో తను ఈ పదాలు పాడుకుంటుంది
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.
ఈ శరీరం ఎందుకు జ్వలిస్తుంది?ఈ శ్వాస వెచ్చగా ఎందుకువుంది?
ఇది ఎలాంటి అగ్ని? ఈ దీపం ఎందుకు మలిగిపోతుంది?
దీపం వెలుగంగానే శలభం వచ్చింది
అగ్ని ఒడిలో తనకి తాను దూకింది.
నేను మరో శలభాన్ని అడిగాను..అగ్నిలో ఉన్నదేమిటని
అది ఏమీ మాట్లాడదు...తనలోకంలో తను ఈ పదాలు పాడుకుంటుంది
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.
నిషా ఎలా ఉంటుంది? అడుగులుతడబడతాయెందుకు?
కంటికి ఏమీ ఎందుకు కానరాదు? ఈ ఆనందం ఎలాకలుగుతుంది?
ఒకరోజు మధుశాల వైపు చూడవెళ్ళాను
మైకపు కౌగిలిలోఉన్న ఒక తాగుబోతు అటు వెళుతున్నాడు
నేనతన్ని అడిగాను ..ఎందుకు జీవితమంతా తాగుతూనే ఉన్నావని.
అతను ఏమీ మాట్లాడడు...తనలోకంలో తను ఈ పదాలు పాడుకుంటు న్నాడు
ప్రేమ అనేది ఏమిటో నాకు చెప్పు.”
ఏవైతే నాశన హేతువలని చెప్పారో అవే ప్రేమానుభూతికి కారణాలౌతున్నయని కవి అంటున్నాడు.
(గీత రచయిత సంతోష్ ఆనంద్, సంగీతకారులు లక్షికాంత్ ప్యారేలాల్, గానం సురేష్ వాడ్కర్,లతా)
-ముళ్ళపూడి సుబ్బారావు