Showing posts with label nadeem sravan. Show all posts
Showing posts with label nadeem sravan. Show all posts

Thursday, February 8, 2018

సారె జగ్ మే కహీ నహీ హై దూసర హిందూస్తాన్

‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-149
‘సారె జగ్ మే కహీ నహీ హై దూసర హిందూస్తాన్’
(జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు)
పర్ దేశ్ (1997) సినిమాలో పాట. నదీమ్ -శ్రవణ్ సంగీతం. ఆనంద్ బక్షి రచన. హరిహరన్,శంకర్ మహదేవన్,కవితా కృష్ణమూర్తి ,ఆదిత్య నారాయణ్ గానం.
రోదసి లో ఉన్న రాకేశ్ శర్మ ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అడిగింది `అక్కడినుండి భారతదేశమెలా కనపడుతుంద`ని. `సారే జహాసే అచ్చా` అని ఆయన వెంటనే సమాధానమిచ్చాడు.దూరంనుండి అలానే ఉంటుందేమో.
ఎ బి సి డి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్ )అని 90లలో ఇండియా టుడే లో ఒక ఆర్టికల్ వచ్చింది. భిన్న సంస్కృతులను సమతౌల్యం చేసుకోవాల్సిన అవసరం సంఖ్యాపరంగా గణనీయమైన సమూహానికి అప్పటికి వచ్చినట్టుంది. ప్రత్యేకంగా యువతకు. హిందీ సినిమాలకు చక్కని సబ్జెక్ట్ దొరికింది. చాలానే సినిమాలు ఈ సబ్జెక్ట్ పై వచ్చాయి.
అలాంటి సబ్జెక్ట్ పై వచ్చిన `దిల్ వాలె దుల్హనియా లేజాయెంగే ` వచ్చిచరిత్రాత్మక విజయం సాధించింది. తర్వాత `పర్ దేశ్ `వచ్చింది. రెండు సినిమాలలోనూ మాతృభూమిపై మమతను చాటే పాటలున్నాయి.
అమ్రిశ్ పురి గొంతు ఇనుపగొలుసులు రాపిడితో వచ్చే శబ్దాన్ని పోలిఉంటుందంటారు. తెలుగు సినిమాలలో అతని సంభాషణల్ని మిమిక్రీ కళాకారులు అనుకరిస్తారు. అతను ‘పర్ దేశ్’ సినిమాలోని ఈ పాటలలో గొంతుకలిపాడు.
‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమాలో ఒకపాటలో రచయిత ‘ఇందీవర్’ భారత దేశాన్ని మూడు రంగుల చీరలో ఉన్న వధువు తో పోల్చాడు. ఈ పాటలో భారత దేశాన్ని వధువు నుదిటి పైని బొట్టు తో పోల్చాడు రచయిత ఆనంద్ బక్షి.


“లండన్ చూసాను
పారిస్ చూసాను
ఇంకా జపాన్ చూసాను
మైఖేల్ జాక్ సన్ ను చూసాను,ఎల్విస్ ప్రిస్లీ ని చూసాను
సర్వం చూసాను నా ప్రాణమా!
జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు
ఈ లోకం ఒక వధువైతే
ఆ వధువు నుదుటి బొట్టు
నా ఈ భారతదేశం
ఐ లవ్ మై ఇండియా
ఒకరు మేఘ్ మల్హార్ ఆలపిస్తే
వర్షం తరలివచ్చింది
దీపక్ రాగం వినిపిస్తే
నీటితో దీపం వెలిగింది
సప్త స్వరాల సంగమం ఈ జీవన గీతమాల
మేము మా భగవానునీ వంశీధరుడని అంటాం
వంశీధరా! వంశీధరా!
ఇది నా భారతదేశం”
కోయిల కుహు కుహు పాడుతుంది
హసనాన్ని రోదనను జీవన గీతాలుగా మార్చుకున్నాము
లోకులంతా వారి వారి గీతాలు గానం చేసుకుంటారు
వారు పాడే పాటనుండి ఈ మట్టివాసన గుబాఌస్తుంది
నా మాతృభూమి ఇండియా,నా ప్రేయసి ఇండియా
నా విధి ఇండియా,నా ధర్మం ఇండియా

Saturday, October 21, 2017

పర్ దేశీ !పర్ దేశీ ! జానా నహీ

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-122
పర్ దేశీ !పర్ దేశీ ! జానా నహీ
(పరదేశీ ...వెళ్ళిపోవద్దు)
రాజా హిందుస్తానీ (1996) లో ఉదిత్ నారాయణ్, అల్కా యాగ్నిక్,సప్నా అవస్తీ పాడినపాట. నదీమ్ -శ్రవణ్ సంగీతం.సమీర్ రచన.
పరదేశి పదం ‘కాలరీస్ ‘ప్రాంతాలలో వాడుకలో ఉన్నపదం. పరభాష లేదా పరరాష్టాలకు(ఎక్కువగా ఉత్తరభారతదేశానికి) చెంది, ఇక్కడ స్థిరపడ్డవారిని అనేమాటది. పరదేశి /శ్ హిందీ సినిమాపాటల్లో విరివిగా ఉపయోగించారు. దూరవాసులు, ప్రయాణికులు,పరప్రాంతాలకు చెందినవారు,ఇక్కడ స్థిరంగా ఉండనివారు...ఇలాంటి వారినుద్దేశించి
‘పరదేశియోం సె అఖియా మిలానా’ పాట ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’(1965) సినిమాలోది. సినిమాలో కథానాయకుడు టూరిస్ట్ ప్లేస్ ఐన కాశ్మీర్ లోని ‘డాల్’ లో పడవ నడుపుకుంటున్నాడు.టూరిస్ట్ గా వచ్చిన ఓ ధనిక యువతి తో కళ్ళుకలిపాడు.కథ మలుపులు తిరిగి సుఖాంతమయ్యింది.
గోదావరిలో ఒక యువకుడు టూరిస్టులకోసం పడవ నడుపుతూ బ్రతుకుతున్నాడు. ఒక ‘రాణమ్మ ‘ ను చూసి ఆరాధించాడు. ఆ కథా సుఖాంతమయ్యింది. ఆ సినిమా ‘మా పల్లెలో గోపాలుడు.
అదే సినిమా హిందీలో ‘కత్ తక్ చుప్ రహూంగి’ పేరుతో వచ్చింది. ‘మిత్వా భూల న జానా’ పాటతో గుర్తుంది.
రాజా హిందుస్తానీ (సినిమా పేరూ ,హీరో పేరూ అదే) ఒక హిల్ స్టేషన్లో టాక్సీ నడుపుతున్నాడు. పెద్ద ఇంటి యువతి తన తల్లి గడిపిన ఆ ప్రాంతానికి వచ్చింది.టాక్సి డ్రైవర్ తో అనుబంధంపెంచుకుంది. అదే సమయానికి తండ్రి ఆమెను ఇంటికి తీసుకెళ్ళటానికి వచ్చాడు. తిరుగు ప్రయాణం లో ఒక డాభా దగ్గర ఆగారు.
అక్కడ ఒక సంచారిణి ,మనసు లో ఉన్న ఖాళీని మద్యంతో నింపుకుంటుంది. పాట మొదలుబెట్టింది.గొంతు కలిపిన కథానాయకుడ్ని విని పాటమధ్యలో ఈ మాటలు చెప్పింది.
“నీ గొంతులో ఎంత వ్యధ వుంది?
అంటారు…. గుండె పగిలినపుడు
పలికేది గొంతుకాదని.
కాని అది పగిలినపుడు
ప్రళయం వస్తుంది
తుఫాను వస్తుంది,భూకంపం వస్తుంది
నీ గొంతులో అలాంటి బాధ ఉంది
నీగొంతులో అలాంటి ప్రేమ ఉంది
కాని విను
నీ బాధ,ప్రేమ కు ఈ లోకులు
ఏమి న్యాయం చేస్తారు
నువ్వు తపిస్తూనే ఉంటావు
వాళ్ళు చూస్తూనే ఉంటారు
విను
నువ్వు ఇపడు పాడు
చాలాకాలం తర్వాత ఈ పిచ్చిది
మనసు విప్పి నాట్యం చేస్తుంది.”
ఈ పాట వింటుంటే పాడిన ఉదిత్ నారాయణ్ పాటకు తగిన న్యాయంచేసాడనిపిస్తుంది.
పాట :
“ప్రేమించవద్దని నేను చెప్పట్లేదు
కాని యాత్రికులపట్ల మాత్రం నమ్మకం పెంచుకోకు
పరదేశీ ...వెళ్ళిపోవద్దు
నన్నువదిలి.నన్ను వదిలి
పరదేశీ ..నా ప్రియతమా! ఇచ్చినమాట నిలుపుకో
నన్ను గుర్తుంచుకో ! ఎప్పుదూ మరువవద్దు
నేను నిన్ను కోరాను,నిన్ను ప్రేమించాను
నీకోసం అన్నీ వదులుకున్నాను
యోగినినయ్యానుప్రేమయోగం తీసుకున్నాను
ఏమీ ఆలోచించక మనోవ్యధ తెచ్చుకున్నాను
పరదేశి! నా ప్రియతమా! తిరిగి రా!
మరువకు,మరువకు, మరువకు
ప్రతిక్షణం నా తలపులు నిన్ను బాధిస్తాయి
నేను మేలుకుని ఉంటా! నీకూ నిదురరాదు
నన్ను ఇలా వదిలివెళ్ళితే
నిజం చెబుతున్నా! చాలా పశ్చాత్తాపపడతావు
పరదేశీ ! నా ప్రియా! నన్ను ఏడిపించకు”