‘నచ్చిన ’ పాటలు- ‘లోపలి ’ మాటలు-149
‘సారె జగ్ మే కహీ నహీ హై దూసర హిందూస్తాన్’
(జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు)
పర్ దేశ్ (1997) సినిమాలో పాట. నదీమ్ -శ్రవణ్ సంగీతం. ఆనంద్ బక్షి రచన. హరిహరన్,శంకర్ మహదేవన్,కవితా కృష్ణమూర్తి ,ఆదిత్య నారాయణ్ గానం.
రోదసి లో ఉన్న రాకేశ్ శర్మ ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అడిగింది `అక్కడినుండి భారతదేశమెలా కనపడుతుంద`ని. `సారే జహాసే అచ్చా` అని ఆయన వెంటనే సమాధానమిచ్చాడు.దూరంనుండి అలానే ఉంటుందేమో.
ఎ బి సి డి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్ )అని 90లలో ఇండియా టుడే లో ఒక ఆర్టికల్ వచ్చింది. భిన్న సంస్కృతులను సమతౌల్యం చేసుకోవాల్సిన అవసరం సంఖ్యాపరంగా గణనీయమైన సమూహానికి అప్పటికి వచ్చినట్టుంది. ప్రత్యేకంగా యువతకు. హిందీ సినిమాలకు చక్కని సబ్జెక్ట్ దొరికింది. చాలానే సినిమాలు ఈ సబ్జెక్ట్ పై వచ్చాయి.
అలాంటి సబ్జెక్ట్ పై వచ్చిన `దిల్ వాలె దుల్హనియా లేజాయెంగే ` వచ్చిచరిత్రాత్మక విజయం సాధించింది. తర్వాత `పర్ దేశ్ `వచ్చింది. రెండు సినిమాలలోనూ మాతృభూమిపై మమతను చాటే పాటలున్నాయి.
అమ్రిశ్ పురి గొంతు ఇనుపగొలుసులు రాపిడితో వచ్చే శబ్దాన్ని పోలిఉంటుందంటారు. తెలుగు సినిమాలలో అతని సంభాషణల్ని మిమిక్రీ కళాకారులు అనుకరిస్తారు. అతను ‘పర్ దేశ్’ సినిమాలోని ఈ పాటలలో గొంతుకలిపాడు.
‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమాలో ఒకపాటలో రచయిత ‘ఇందీవర్’ భారత దేశాన్ని మూడు రంగుల చీరలో ఉన్న వధువు తో పోల్చాడు. ఈ పాటలో భారత దేశాన్ని వధువు నుదిటి పైని బొట్టు తో పోల్చాడు రచయిత ఆనంద్ బక్షి.
“లండన్ చూసాను
పారిస్ చూసాను
ఇంకా జపాన్ చూసాను
మైఖేల్ జాక్ సన్ ను చూసాను,ఎల్విస్ ప్రిస్లీ ని చూసాను
సర్వం చూసాను నా ప్రాణమా!
జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు
ఈ లోకం ఒక వధువైతే
ఆ వధువు నుదుటి బొట్టు
నా ఈ భారతదేశం
ఐ లవ్ మై ఇండియా
ఒకరు మేఘ్ మల్హార్ ఆలపిస్తే
వర్షం తరలివచ్చింది
దీపక్ రాగం వినిపిస్తే
నీటితో దీపం వెలిగింది
సప్త స్వరాల సంగమం ఈ జీవన గీతమాల
మేము మా భగవానునీ వంశీధరుడని అంటాం
వంశీధరా! వంశీధరా!
ఇది నా భారతదేశం”
కోయిల కుహు కుహు పాడుతుంది
హసనాన్ని రోదనను జీవన గీతాలుగా మార్చుకున్నాము
లోకులంతా వారి వారి గీతాలు గానం చేసుకుంటారు
వారు పాడే పాటనుండి ఈ మట్టివాసన గుబాఌస్తుంది
నా మాతృభూమి ఇండియా,నా ప్రేయసి ఇండియా
నా విధి ఇండియా,నా ధర్మం ఇండియా
‘సారె జగ్ మే కహీ నహీ హై దూసర హిందూస్తాన్’
(జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు)
పర్ దేశ్ (1997) సినిమాలో పాట. నదీమ్ -శ్రవణ్ సంగీతం. ఆనంద్ బక్షి రచన. హరిహరన్,శంకర్ మహదేవన్,కవితా కృష్ణమూర్తి ,ఆదిత్య నారాయణ్ గానం.
రోదసి లో ఉన్న రాకేశ్ శర్మ ను అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అడిగింది `అక్కడినుండి భారతదేశమెలా కనపడుతుంద`ని. `సారే జహాసే అచ్చా` అని ఆయన వెంటనే సమాధానమిచ్చాడు.దూరంనుండి అలానే ఉంటుందేమో.
ఎ బి సి డి (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీస్ )అని 90లలో ఇండియా టుడే లో ఒక ఆర్టికల్ వచ్చింది. భిన్న సంస్కృతులను సమతౌల్యం చేసుకోవాల్సిన అవసరం సంఖ్యాపరంగా గణనీయమైన సమూహానికి అప్పటికి వచ్చినట్టుంది. ప్రత్యేకంగా యువతకు. హిందీ సినిమాలకు చక్కని సబ్జెక్ట్ దొరికింది. చాలానే సినిమాలు ఈ సబ్జెక్ట్ పై వచ్చాయి.
అలాంటి సబ్జెక్ట్ పై వచ్చిన `దిల్ వాలె దుల్హనియా లేజాయెంగే ` వచ్చిచరిత్రాత్మక విజయం సాధించింది. తర్వాత `పర్ దేశ్ `వచ్చింది. రెండు సినిమాలలోనూ మాతృభూమిపై మమతను చాటే పాటలున్నాయి.
అమ్రిశ్ పురి గొంతు ఇనుపగొలుసులు రాపిడితో వచ్చే శబ్దాన్ని పోలిఉంటుందంటారు. తెలుగు సినిమాలలో అతని సంభాషణల్ని మిమిక్రీ కళాకారులు అనుకరిస్తారు. అతను ‘పర్ దేశ్’ సినిమాలోని ఈ పాటలలో గొంతుకలిపాడు.
‘పూరబ్ ఔర్ పశ్చిమ్’ (1970) సినిమాలో ఒకపాటలో రచయిత ‘ఇందీవర్’ భారత దేశాన్ని మూడు రంగుల చీరలో ఉన్న వధువు తో పోల్చాడు. ఈ పాటలో భారత దేశాన్ని వధువు నుదిటి పైని బొట్టు తో పోల్చాడు రచయిత ఆనంద్ బక్షి.
“లండన్ చూసాను
పారిస్ చూసాను
ఇంకా జపాన్ చూసాను
మైఖేల్ జాక్ సన్ ను చూసాను,ఎల్విస్ ప్రిస్లీ ని చూసాను
సర్వం చూసాను నా ప్రాణమా!
జగమంతటిలోనూ మరెక్కడా మరొక హిందూస్తాన్ లేదు
ఈ లోకం ఒక వధువైతే
ఆ వధువు నుదుటి బొట్టు
నా ఈ భారతదేశం
ఐ లవ్ మై ఇండియా
ఒకరు మేఘ్ మల్హార్ ఆలపిస్తే
వర్షం తరలివచ్చింది
దీపక్ రాగం వినిపిస్తే
నీటితో దీపం వెలిగింది
సప్త స్వరాల సంగమం ఈ జీవన గీతమాల
మేము మా భగవానునీ వంశీధరుడని అంటాం
వంశీధరా! వంశీధరా!
ఇది నా భారతదేశం”
కోయిల కుహు కుహు పాడుతుంది
హసనాన్ని రోదనను జీవన గీతాలుగా మార్చుకున్నాము
లోకులంతా వారి వారి గీతాలు గానం చేసుకుంటారు
వారు పాడే పాటనుండి ఈ మట్టివాసన గుబాఌస్తుంది
నా మాతృభూమి ఇండియా,నా ప్రేయసి ఇండియా
నా విధి ఇండియా,నా ధర్మం ఇండియా