Showing posts with label kumar sanu. Show all posts
Showing posts with label kumar sanu. Show all posts

Wednesday, February 7, 2018

తుమ్ మిలె దిల్ ఖిలే ఔర్ జీనేకో క్యా చాహియే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-128
`తుమ్ మిలె దిల్ ఖిలే ఔర్ జీనేకో క్యా చాహియే)
(నువ్వు కలిసావు. హృదయం వికసించింది,ఇక జీవించటానికి ఏమి కావాలి)
క్రిమినల్ (1996) సినిమాలో కుమార్ సాను, అల్కా యాగ్నిక్ పాడిన పాట. ఎమ్ ఎమ్ క్రీ సంగీతం, ఇందీవర్ రచన.
దక్షిణాది సంగీత దర్శకులు రాజేశ్వర రావు,ఆది నారాయణ రావు వంటివారు తమసంగీతాన్ని ఉత్తరాదికి వినిపించినా అది చుట్టపుచూపే....
బహుశా ఇళయరాజా నే తొలిగా హిందీ సీమలో గుర్తింపు పొందినవాడు కావచ్చు. తర్వాత ఏ ఆర్ రెహ్మాన్ ను హిందీ ఆంకర్లు `రెహ్మాన్ ..దో దిన్ కి మెహ్మాన్` అని వెక్కిరించినా అతడు రెండు దశాబ్దాలుగా అక్కడ నిలబడే ఉన్నాడు.
తర్వాత సంగీత దర్శకుడు కీరవాణి కూడా,ఎమ్ ఎమ్ క్రీమ్ పేరుతో కొన్ని హిందీ సినిమాలకు సంగీతమిచ్చాడు. వాటిలో కొన్ని పాటలు దేశం నలుమూలలనుండీ `ఫర్మాయిష్` చేయబడుతూనే ఉన్నాయి.
క్రిమినల్ సినిమా రెండు భాషల్లో `మహేశ్ భట్` దర్శకత్వంలోవచ్చింది. సినిమాలో చెప్పుకోదగింది సంగీతమే. అందులో ముఖ్యంగా ఈ పాట. శ్రావ్యమైన సంగీతం, ప్రశాంతతతో నిండిన అలాపన,చక్కని విజువల్స్.

~నువ్వు కలిసావు. హృదయం వికసించింది
ఇక జీవించటానికి ఏమి కావాలి
నువ్వు చింతించకు,నీ వెనువెంట
నేను ఉంటాను జీవితాంతం
లోకంలోని ప్రేమంతా నేను నీలోనే పొందాను
నిన్ను చూడటానికే చంద్రుడు ఉదయిస్తుంటాడు
నిన్ను తనలో చూసుకోవటానికే అద్దం పరితపిస్తుంది
ఇంత అందమైనది వేరొకటి లేదు
రెండు లోకాల సౌందర్యం ఒక్క నీలోనే కలసి వచ్చింది
మనం మరణిస్తాము ప్రేమ ఎప్పడూ మరణించదు
ప్రేమించినవారు అమరులవుతారు
ఎంత సౌందర్యమో అంత నమ్మిక
ప్రేమతో ఒక సారి చూడు..తిరిగి బ్రతికించు

Saturday, October 21, 2017

జబ్ కోయి బాత్ బిగడ్ జాయే

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-119
జబ్ కోయి బాత్ బిగడ్ జాయే,జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
(“కాలం విషమించినపుడు,కష్టాలు చుట్టుముట్టినపుడు)
జుర్మ్ (1990) సినిమాలో కుమార్ సాను పాడిన పాట. రాజేశ్ రోషన్ సంగీతం.ఇందీవర్ రచన.
అనుకరిస్తున్నారని తెలిస్తే అభిమానించటం కష్టమే. అలాంటివారినుంది కొన్ని మంచిపాటలు వచ్చినా.
88-89ప్రాంతంలో హిందీ పాటల్లో మెలొడి తిరిగి ప్రవేశించింది. కొత్తసంగీతదర్శకులతో పాటు కొత్త ‘రఫీ’లు ,కొత్త ‘కిశోర్ కుమార్’లు కూడావచ్చారు.
అలాంటివారిలో ఒక ‘కిశోర్ కుమార్’ ‘కుమార్ సాను’. అతను కిశోర్ పాటల్ని తిరిగి పాడాడు.అవి బానే మార్కెట్ అయ్యాయి. సినిమాలలో సొంతపాటలు కిశోర్ ను అనుకరిస్తూ పాడి సక్సెస్ అయ్యాడు. అతని పాటలు వినపడితే విన్నాను కాని వెతుక్కుని వినలేదు.
అలాంటి కుమార్ సాను గురించి ఒక మిత్రునిద్వారా విన్నమాట. నా మిత్రుని మిత్రుడొకరు హిందీపాటల అభిమాని. అతను కుమార్ సాను అభిమాని. ఎంత అభిమానమంటే చనిపోయేటపుడు కుమార్ సాను పాటలు వింటూండాలనేంత.
ఇదినాకు ఊహకు రాని విషయం.లోకోభిన్నరుచి.
నావరకు ‘కుమార సాను’ పాటల్లో నచ్చిందడిగితే నేను చెప్పేది ‘జుర్మ్’ సినిమాలో ఈ పాట.
సంగీతదర్శకుడు రాజేశ్ రోషన్ తన తండ్రి ‘రోషన్’ అడుగుజాడల్లో నడిచాడు. అప్పటికి పదిహేనేళ్ళుగా మెలొడీ తో నిండిన సంగీతం అందిస్తూ కొత్త సంగీతదర్శకులపోటీని తట్టుకున్నాడు.ఇప్పటికీ తన సోదరుడు రాకేశ్ రోషన్ సినిమాలకు సంగీతం సమకూరుస్తూనే ఉన్నాడు.
గీతరచయిత ఇందీవర్ తో కలిసి అనేక హిట్ గీతాలందించాడు.
వారికలయికలో వచ్చిన ఒక మధురగీతమిది.
“కాలం విషమించినపుడు
కష్టాలు చుట్టుముట్టినపుడు
నువ్వునాకు తోడు నివ్వు, ప్రియతమా!
లోకంలో నువ్వు మినహా
ఇంతకుముందు ,ఇప్పుడూ ఎవరూలేరు.
రాత్రి లో వెన్నెల ఉన్నంత సేపూ
ప్రతీఒక్కరూ తోడుంటారు
చిక్కని చీకటిలో,నువ్వన్నా
నాచేయి ని విడువకు.
విధేయత చూపమనే నియమాలను
పాటిస్తాను నీ తోడుగా
నా చేతిలో ఉన్న
చివరి శ్వాస వరకు
నా మనసు నమ్ముతుంది
ఇదివరకెక్కటిదో కలయిక ఇది
ఈ బంధం తరతరాలది
ఈ నాటి మాట కాదిది.”

ఎక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా

నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-115
ఎక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా
(ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే)
1994 లో వచ్చిన ‘1942 ఎ లవ్ స్టొరీ’ సినిమాలో పాట. కుమార్ సాను పాడిన పాట.
1942 కాలానికి చెందిన ( పీరీడ్) ఫిల్మ్ గా వచ్చిన ఆ సినిమాకి ఇప్పటి చిత్ర ప్రముఖులు విధు వినోద్ చోప్రా, సంజయ్ లీలా బన్సాలి పని చేసారు. ఆర్ డి బర్మన్ సంగీతదర్శకుడు. జావెద్ అఖ్తర్ గీత రచయిత.
అప్పటికి ఆర్ డి బర్మన్ సంగీత దర్శకుడిగా తన పునర్వైభవం పొందటానికి చాలానే కృషి చేస్తున్నాడు. ఆ కృషి ‘1942- ఎ- లవ్ స్టొరీ’ లో కనిపిస్తుంది. ఆ సినిమా సంగీతం అతనికి స్వయంగా నచ్చింది. అదే మాట తన పాత మిత్రులతో పంచుకున్నాడు. ఐతే అదే సినిమా అతని ‘హంస గీత’ మై పోయింది. సినిమా విడుదలై సంగీతం శ్రోతలకు చేరువయ్యేసరికి అతను మరణించాడు.
‘ఉపమ కాఌదాసస్య ‘ అంటారు. ఉపమాలంకారాన్ని వినియోగించటంలో అంతవారులేరని అర్ధమనుకుంటాను. కాఌదాసు ఉలిక్కిపడేట్టు జావెద్ అఖ్తర్ ఈ పాట రాసాడు. పాటలో చరణం తప్ప మిగతావన్నీ ఉపమానాలే. ఇరవై పైనే ‘ఎలా అనిపించింది’ అన్నదానికి సమాధానాలు. ఇన్ని ఉపమానాలు కాఌదాసు ఒకేచోట ఎప్పుడూ రాసిఉందక పోవచ్చు.
పాట పాడిన గాయకుడు ‘కుమార్ సాను’ ఎనభైల చివరి సంవత్సరాలలో ప్రముఖగాయకుడిగా గుర్తింపుపొందాడు. కిశోర్ కుమార్ అనుకరిస్తూ పాడిన అనేక గాయకుల్లో విజయవంతమైన గాయకుడు. కిశోర్ కుమార్ ను ఉన్నతశిఖరాల్లో నిలిపిన ఆర్ డి బర్మన్ ఎందువల్లో ‘కుమార్ సాను’ తో ఈ సినిమా వరకూ పాడించలేదు.
“ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
వికసించే గులాబీలా
కవి కన్న కలలా
వెలుతురు కిరణంలా
వనంలో హరిణిలా
వెన్నెల రాత్రిలా
చల్లని మాటలా
గుడిలో వెలుగుతున్న ఒక దీపంలా.
ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
అందమైన ఉదయంలా
శీతాకాలపు నీరెండలా
వీణానాదంలా
రంగుల రాణిలా
అల్లుకున్న తీగలా
కెరటాల ఖేఌలా
పరిమళాలతో వీచే చల్లని గాలిలా
ఒక అమ్మాయిని చూసినపుడు ఎలా అనిపించిందంటే
నాట్యంచేసే నెమలిలా
పట్టుదారంలా
దేవరాగంలా
చందనపు చిరుమంటలా
పదహారు రకాల అలంకరణలా
తెలిమంచులా
నెమ్మదిగా పెరుగుతున్న నిషాలా”