నచ్చిన’ పాటలు- ‘లోపలి’ మాటలు-119
జబ్ కోయి బాత్ బిగడ్ జాయే,జబ్ కోయి ముష్కిల్ పడ్ జాయే
(“కాలం విషమించినపుడు,కష్టాలు చుట్టుముట్టినపుడు)
జుర్మ్ (1990) సినిమాలో కుమార్ సాను పాడిన పాట. రాజేశ్ రోషన్ సంగీతం.ఇందీవర్ రచన.
అనుకరిస్తున్నారని తెలిస్తే అభిమానించటం కష్టమే. అలాంటివారినుంది కొన్ని మంచిపాటలు వచ్చినా.
88-89ప్రాంతంలో హిందీ పాటల్లో మెలొడి తిరిగి ప్రవేశించింది. కొత్తసంగీతదర్శకులతో పాటు కొత్త ‘రఫీ’లు ,కొత్త ‘కిశోర్ కుమార్’లు కూడావచ్చారు.
అలాంటివారిలో ఒక ‘కిశోర్ కుమార్’ ‘కుమార్ సాను’. అతను కిశోర్ పాటల్ని తిరిగి పాడాడు.అవి బానే మార్కెట్ అయ్యాయి. సినిమాలలో సొంతపాటలు కిశోర్ ను అనుకరిస్తూ పాడి సక్సెస్ అయ్యాడు. అతని పాటలు వినపడితే విన్నాను కాని వెతుక్కుని వినలేదు.
అలాంటి కుమార్ సాను గురించి ఒక మిత్రునిద్వారా విన్నమాట. నా మిత్రుని మిత్రుడొకరు హిందీపాటల అభిమాని. అతను కుమార్ సాను అభిమాని. ఎంత అభిమానమంటే చనిపోయేటపుడు కుమార్ సాను పాటలు వింటూండాలనేంత.
ఇదినాకు ఊహకు రాని విషయం.లోకోభిన్నరుచి.
నావరకు ‘కుమార సాను’ పాటల్లో నచ్చిందడిగితే నేను చెప్పేది ‘జుర్మ్’ సినిమాలో ఈ పాట.
సంగీతదర్శకుడు రాజేశ్ రోషన్ తన తండ్రి ‘రోషన్’ అడుగుజాడల్లో నడిచాడు. అప్పటికి పదిహేనేళ్ళుగా మెలొడీ తో నిండిన సంగీతం అందిస్తూ కొత్త సంగీతదర్శకులపోటీని తట్టుకున్నాడు.ఇప్పటికీ తన సోదరుడు రాకేశ్ రోషన్ సినిమాలకు సంగీతం సమకూరుస్తూనే ఉన్నాడు.
గీతరచయిత ఇందీవర్ తో కలిసి అనేక హిట్ గీతాలందించాడు.
వారికలయికలో వచ్చిన ఒక మధురగీతమిది.
“కాలం విషమించినపుడు
కష్టాలు చుట్టుముట్టినపుడు
నువ్వునాకు తోడు నివ్వు, ప్రియతమా!
లోకంలో నువ్వు మినహా
ఇంతకుముందు ,ఇప్పుడూ ఎవరూలేరు.
(“కాలం విషమించినపుడు,కష్టాలు చుట్టుముట్టినపుడు)
జుర్మ్ (1990) సినిమాలో కుమార్ సాను పాడిన పాట. రాజేశ్ రోషన్ సంగీతం.ఇందీవర్ రచన.
అనుకరిస్తున్నారని తెలిస్తే అభిమానించటం కష్టమే. అలాంటివారినుంది కొన్ని మంచిపాటలు వచ్చినా.
88-89ప్రాంతంలో హిందీ పాటల్లో మెలొడి తిరిగి ప్రవేశించింది. కొత్తసంగీతదర్శకులతో పాటు కొత్త ‘రఫీ’లు ,కొత్త ‘కిశోర్ కుమార్’లు కూడావచ్చారు.
అలాంటివారిలో ఒక ‘కిశోర్ కుమార్’ ‘కుమార్ సాను’. అతను కిశోర్ పాటల్ని తిరిగి పాడాడు.అవి బానే మార్కెట్ అయ్యాయి. సినిమాలలో సొంతపాటలు కిశోర్ ను అనుకరిస్తూ పాడి సక్సెస్ అయ్యాడు. అతని పాటలు వినపడితే విన్నాను కాని వెతుక్కుని వినలేదు.
అలాంటి కుమార్ సాను గురించి ఒక మిత్రునిద్వారా విన్నమాట. నా మిత్రుని మిత్రుడొకరు హిందీపాటల అభిమాని. అతను కుమార్ సాను అభిమాని. ఎంత అభిమానమంటే చనిపోయేటపుడు కుమార్ సాను పాటలు వింటూండాలనేంత.
ఇదినాకు ఊహకు రాని విషయం.లోకోభిన్నరుచి.
నావరకు ‘కుమార సాను’ పాటల్లో నచ్చిందడిగితే నేను చెప్పేది ‘జుర్మ్’ సినిమాలో ఈ పాట.
సంగీతదర్శకుడు రాజేశ్ రోషన్ తన తండ్రి ‘రోషన్’ అడుగుజాడల్లో నడిచాడు. అప్పటికి పదిహేనేళ్ళుగా మెలొడీ తో నిండిన సంగీతం అందిస్తూ కొత్త సంగీతదర్శకులపోటీని తట్టుకున్నాడు.ఇప్పటికీ తన సోదరుడు రాకేశ్ రోషన్ సినిమాలకు సంగీతం సమకూరుస్తూనే ఉన్నాడు.
గీతరచయిత ఇందీవర్ తో కలిసి అనేక హిట్ గీతాలందించాడు.
వారికలయికలో వచ్చిన ఒక మధురగీతమిది.
“కాలం విషమించినపుడు
కష్టాలు చుట్టుముట్టినపుడు
నువ్వునాకు తోడు నివ్వు, ప్రియతమా!
లోకంలో నువ్వు మినహా
ఇంతకుముందు ,ఇప్పుడూ ఎవరూలేరు.
రాత్రి లో వెన్నెల ఉన్నంత సేపూ
ప్రతీఒక్కరూ తోడుంటారు
చిక్కని చీకటిలో,నువ్వన్నా
నాచేయి ని విడువకు.
ప్రతీఒక్కరూ తోడుంటారు
చిక్కని చీకటిలో,నువ్వన్నా
నాచేయి ని విడువకు.
విధేయత చూపమనే నియమాలను
పాటిస్తాను నీ తోడుగా
నా చేతిలో ఉన్న
చివరి శ్వాస వరకు
పాటిస్తాను నీ తోడుగా
నా చేతిలో ఉన్న
చివరి శ్వాస వరకు
నా మనసు నమ్ముతుంది
ఇదివరకెక్కటిదో కలయిక ఇది
ఈ బంధం తరతరాలది
ఈ నాటి మాట కాదిది.”
ఇదివరకెక్కటిదో కలయిక ఇది
ఈ బంధం తరతరాలది
ఈ నాటి మాట కాదిది.”